తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న దొంత రమేష్
కాకతీయ, హుజురాబాద్ : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ టీపీసీసీ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
వోడితల ప్రణవ్ నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని దొంత రమేష్ తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు.


