epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ విజయాల‌ను ఎవ‌రూ ఆపలేరు

కాంగ్రెస్ విజయాల‌ను ఎవ‌రూ ఆపలేరు
సాకారం అవుతున్న పేదల కలలు!
ప్రజా ప్రభుత్వంలో హామీల అమలు
గ్రామాలాభివృద్ధే మా ప్ర‌భుత్వం ల‌క్ష్యం
: మంత్రి పొంగులేటి
మరిపెడలో రూ.6.50 కోట్ల పనులకు శంకుస్థాపన

కాకతీయ, మరిపెడ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రజా ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదల కలలు నెరవేరుతున్నాయని, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు సహా పలు అభివృద్ధి పనులకు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిని ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డోర్నకల్ నియోజకవర్గంలో గత పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. వచ్చే పది ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే విజయం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాలే బలం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విస్తృత మద్దతు తీసుకొస్తాయని మంత్రి అన్నారు. ఈ పథకాలే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే తాజుద్దీన్, పానుగోతు రామ్‌లాల్, బంక ప్రమోద్, అన్వర్ పాశా, అఫ్జల్, రవికాంత్, వెంకన్న, వేణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img