epaper
Thursday, January 15, 2026
epaper

టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు

టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు
ఏఏఐ చేతికి భూముల అప్పగింత
253 ఎకరాలు సేకరించిన రాష్ట్రం
ఎకరానికి రూ.1.20 కోట్ల పరిహారం
జనవరిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ మామునూరు విమానాశ్రయ పునర్నిర్మాణానికి మరో కీలక మైలురాయి దాటింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం శ‌నివారం అధికారికంగా అప్పగించింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు స్పష్టమైన దారి తెరచుకుంది. శనివారం ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు బృందంతో కలిసి వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకోగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో భూసంబంధిత పత్రాలను అధికారులకు అందజేశారు. అన్ని అనుమతులు, భూసేకరణ పూర్తికావడంతో 2026 జనవరిలో పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ గేమ్‌చేంజర్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

రైతులకు భారీ పరిహారం

విమానాశ్రయ విస్తరణకు అవసరమైన అదనపు భూముల కోసం మామునూరు పరిసర గ్రామాలైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి మొత్తం 253 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం చెల్లిస్తూ కేవలం ఏడాది కాలంలో భూసేకరణను పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో 136 మంది రైతులు, స్థానికులు భూములు కోల్పోయినా, న్యాయమైన పరిహారం అందడంతో వారు సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మామునూరు పాత విమానాశ్రయ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఏఏఐ పరిధిలో ఉంది. నూతన విస్తరణకు కావాల్సిన భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. గతంలో భూసేకరణ, పునరావాస వ్యయాల కోసం మరో రూ.250 కోట్లు కేటాయించగా, కేంద్ర విమానయాన శాఖ కూడా రూ.450 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధుల కొరత లేకుండా పనులు ముందుకు సాగుతున్నాయి.

నిజాం కాలం నుంచే విమానాశ్రయం

1930లో నిజాం పాలనలోనే మామునూరులో విమానాశ్రయం ఏర్పాటైంది. 1980లో కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అప్పటి నుంచి పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో రీజినల్ కనెక్టివిటీ పథకం కింద అభివృద్ధి ప్రతిపాదనలు వచ్చినా, వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img