epaper
Thursday, January 15, 2026
epaper

కృత్రిమ అవ‌య‌వాల‌తో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం

కృత్రిమ అవ‌య‌వాల‌తో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం
దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించిన‌ మంత్రి
సేవామార్గంలో ఆలయ ఫౌండేషన్ ముందడుగు
మహావీర్ వికలాంగుల సహాయ సమితి సహకారం
వరంగల్‌లో రెండు రోజుల శిబిరం ఏర్పాటు

కాకతీయ, వరంగల్ : దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో ఆలయ ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తక్కువ బరువు, నాణ్యతతో కూడిన కృత్రిమ అవయవాలు దివ్యాంగుల జీవనాన్ని సులభతరం చేస్తాయని అన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

నాణ్యతతో పరికరాల అందజేత

ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే కృత్రిమ అవయవాలు కొన్నిసార్లు బరువుగా ఉండటంతో వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. మహావీర్ సమితి ద్వారా అందిస్తున్న పరికరాలు తక్కువ బరువుతో పాటు మెరుగైన పనితీరుతో ఉండటం అభినందనీయమన్నారు. దివ్యాంగులైనప్పటికీ అసాధ్యాలను సుసాధ్యం చేసిన వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ… నగరంలో రెండురోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడం హర్షణీయమన్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన స్వంత రాష్ట్రంలో ఇలాంటి సామాజిక సేవలు చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ… మహావీర్ సమితి నిపుణులు మూడు రోజుల పాటు శిబిరంలోనే ఉండి కొలతలు తీసుకొని కృత్రిమ అవయవాలను అమర్చి వాటి పనితీరును పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరం ద్వారా సుమారు 150 మందికి కృత్రిమ అవయవాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img