epaper
Thursday, January 15, 2026
epaper

సంక్షోభంలో ప్రజాస్వామ్యం

సంక్షోభంలో ప్రజాస్వామ్యం
పేదల కడుపుకొట్టేందుకే ఉపాధి పథకం రద్దు
కార్పొరేట్లకే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యం
మహాత్మాగాంధీ ఆలోచనలకు అవమానం
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం
ప్రజా ఉద్యమానికి శ్రేణులు సిద్ధం కావాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

కాకతీయ, న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల కడుపుకొట్టిందని ఖర్గే మండిపడ్డారు. ఈ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు జీవనాధారం లభించిందని, దానిని బలహీనపరచడం పేదలపై దాడితో సమానమన్నారు.

గాంధీని అవమానించడమే
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలను, ఆశయాలను అవమానించడమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. గాంధీ ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయం బీజేపీ పాలనలో కనుమరుగవుతున్నాయని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకరిస్తూ, పేదలు, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, కార్మికులు, యువత సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధం

ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి సిద్ధమవ్వాలని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఖర్గే తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img