epaper
Thursday, January 15, 2026
epaper

డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ

డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ
25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి అంగరంగ వైభవం
850 మంది విద్యార్థుల క్రమశిక్షణాయుత మార్చ్‌పాస్ట్ ఆకర్షణ

కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులపూర్ గ్రామంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించగా, నిర్వహించిన కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు 850 మంది విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల క్రమబద్ధత, శాసనబద్ధ నడకను చూసి అతిథులు ప్రశంసలు కురిపించారు.

25 ఏళ్ల విజయవంతమైన ప్రయాణం

అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దయ్యాల సదయ్య మాట్లాడుతూ, పాఠశాల స్థాపన నుంచి ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను వివరించారు. 2001లో 190 మంది విద్యార్థులతో ప్రారంభమైన డిస్నీల్యాండ్ హై స్కూల్ నేడు 850 మంది విద్యార్థులతో 25 ఏళ్ల విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని తెలిపారు. విద్యలో నాణ్యత, క్రమశిక్షణే పాఠశాల ప్రధాన బలమని పేర్కొన్నారు.

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ సి. సతీష్ బాబు, హనుమకొండ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి బొక్క సంజీవరెడ్డి, తిరుపతి డీఎస్పీ (అసెంబ్లీ, హైదరాబాద్) ఎల్. రాజేష్, దామెర మండల విద్యాధికారి కె. అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ దామెర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీ నివాసం డైరెక్టర్లు బి. శోభారాణి, డి. రాకేష్ భాను, డి. దినేష్ చందర్, కుటుంబ సభ్యులు డా. పవన్, విజయలక్ష్మి, మౌనిక, కావ్య, మీనా, శ్రీలత, శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img