epaper
Monday, March 2, 2026
epaper

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన
మహిళలను కించపరిచిన వారు భూస్థాపితం
రేవంత్ మాటలే ఆయన స్థాయిని బయటపెడుతున్నాయి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సన్మాన సభ వేదికగా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించి, పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా పాలన అందించిన కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తన మాటలతోనే ప్రజల్లో తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. నువ్వు సీఎం వా? చిల్లరగానివా? అన్న స్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డే అన్నారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరిగి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. పది శాతం పనులు కూడా పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమిదని కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించారు.

మహిళలపై వ్యాఖ్యలతో అసలు స్వరూపం

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించిన సుంకే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో మహిళల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవం ఏంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళలను కించపరిచిన వారు చరిత్రలో భూస్థాపితం అయ్యారని దుర్యోధనుడు, రావణాసురుల ఉదాహరణలు ఇచ్చారు. 2029లో రేవంత్ రెడ్డిని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

హామీల అమలులో వైఫల్యం

నవంబర్‌లో వేయాల్సిన రైతుబంధు, డిసెంబర్‌లో వేయాల్సిన రైతుబంధు ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, పెన్షన్‌ను రూ.4 వేలుగా చేస్తామన్న హామీలు నెరవేర్చలేదని, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమిదని మండిపడ్డారు. సీఎం మాటలపై నియంత్రణ కోసం ఐఏఎస్ అధికారులే రేవంత్ రెడ్డికి మంచి భాష నేర్పించాలని, అవసరమైతే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని కాంగ్రెస్ నేతలే కోరే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మేము తిట్టడం మొదలుపెడితే హుస్సేన్ సాగర్‌లో బండగట్టుకుని దూకాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు సమావేశంలో సంచలనం సృష్టించాయి. సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వి నాయకులు చుక్క శ్రీనివాస్, బొంకురి మోహన్, మాచర్ల వినయ్, నవీన్ రావు, మామిడి తిరుపతి, పూడూరి మల్లేశం, తౌటు మురళి, వెంకట రమణారెడ్డి, ఆకుల మధుసూదన్, రాజేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, చుక్కారెడ్డి, గడ్డం స్వామి, కొత్త గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img