epaper
Thursday, January 15, 2026
epaper

కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ

కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ
చీకటి ఒప్పందాలు.. రైతులపై పోలీస్ బెదిరింపులు
మూడేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన సవాల్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై గత పాలకుల పాలనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఎండగట్టారు. కాళేశ్వరం లింక్–2 పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొని చీకటి ఒప్పందాలతో పనులు చేపట్టారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కరీంనగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినట్లు తెలిపారు.
2016లో జీవో నం.71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.136 కోట్లకు పెంచారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభించారని అన్నారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీటి విషయంలో అప్పటి మంత్రులు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో ఒడ్డెర జాతి ప్రజలను పోలీసులతో బెదిరించి గుట్టను ఖాళీ చేయించారని, భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామని రైతులను బెదిరించిన ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేయడం తనకు చేతకాదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

ఆరు నెలల్లోనే ఫలితాలు

కేవలం ఆరు నెలల మంత్రిత్వ కాలంలోనే 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించామని, పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ మంత్రిగా దళిత బిడ్డలను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. తన రాజీనామాపై చర్చలు చేస్తున్నవారికి ఘాటైన సమాధానం ఇస్తూ, తాను రాజీనామా చేయాలా వద్దా అనేది ధర్మపురి ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో

గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, అయినప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్, బస్ డిపో తీసుకువస్తామని చెప్పారు. ట్రైబల్ మినిస్టర్ ద్వారా రూ.60 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని, వాడవాడ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
మూడేళ్లలో తాను ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనవరి చివరి వారం వరకు గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్మపురికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img