epaper
Thursday, January 15, 2026
epaper

ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు

ఆలయాల జోలికి వస్తే సహించేది లేదు
మైసమ్మ ఆలయ కూల్చివేతపై బీజేపీ ఆగ్రహం
అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలి: గంట రవికుమార్

కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం మైసమ్మ ఆలయాన్ని పరిశీలించిన గంట రవికుమార్, స్థానిక గ్రామస్తులు, భక్తులతో మాట్లాడి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆలయ కూల్చివేతలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ నిధులతోనే ఆలయాన్ని పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోని అధికారులు హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే కఠినంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై

రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసుల సహాయంతో ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. రోడ్డుపక్కన ఉన్నా, లేఅవుట్ పరిధిలో ఉన్నా కుట్రపూరితంగా ఆలయాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఓరుగల్లులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఒక మతానికి మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలు కనిపించవా?

గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకో అక్రమ నిర్మాణం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, నాలాల కబ్జాలు, రోడ్లపై నిర్మాణాలు జరుగుతున్నా అవి కార్పొరేషన్ అధికారులకు కనిపించడం లేదా అంటూ గంట రవికుమార్ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారా అని మండిపడ్డారు. అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, హిందూ బంధువులు, పైడిపెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img