భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అవగాహన పొందే ఉద్దేశంతో ఈ తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.


