epaper
Monday, March 2, 2026
epaper

ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల ఐక్యత

ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల ఐక్యత
మున్సిపల్ ఎన్నికల్లో శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా కొనసాగుతున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. పరస్పర విభేదాలకు ముగింపు పలుకుతూ, కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) కూటమిగా పోటీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఇరువురు నేతలు కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ప్రధానమని, గతంలోని విభేదాలను పక్కన పెట్టి రాజకీయ సమన్వయంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచినట్లయింది.

విభేదాలకు తెర… సమన్వయానికి ఆరంభం

బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం, పార్టీ నియంత్రణ అంశాలపై గతంలో ఉద్ధవ్, రాజ్ మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చి ఎంఎన్‌ఎస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరు రాజకీయ దారుల్లో సాగారు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యత దృష్ట్యా మళ్లీ కలసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కూటమి ఏర్పాటైంది. ముంబయిపై పట్టును నిలుపుకోవడమే లక్ష్యంగా శివసేన–ఎంఎన్‌ఎస్ కలిసి వ్యూహాలు రచిస్తున్నాయి. మరాఠీ ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ ఐక్యత వెనుక ప్రధాన ఉద్దేశమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఠాక్రే సోదరుల ఐక్యతతో మహారాష్ట్ర రాజకీయాల్లో బలమైన సంకేతం వెలువడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఇది సవాలుగా మారవచ్చని, అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల వ్యూహాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

భవిష్యత్ దిశపై ఉత్కంఠ

శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి ఎంతవరకు ప్రజాదరణ పొందగలుగుతుందన్నది రానున్న ఎన్నికల ఫలితాలతో తేలనుంది. అయితే ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలవడం మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక అధ్యాయంగా నిలవనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img