epaper
Thursday, January 15, 2026
epaper

రూ. 1000 తగ్గించారు

రూ. 1000 తగ్గించారు
ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లలో కొత్త లెక్క‌లు
కాకతీయ వరుస కథనాలతో ఇసుకాసురుల్లో అలజడి
రూ. 5600 నుంచి రూ. 4500కు మార్పు
చర్యలకు, తనిఖీలకు మంగళం పాడిన టీజీఏండీసీ
వంత పాడటంలో ఆంతర్యం ఏమిటి

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు రూపం మార్చుకున్నాయే తప్ప ఆగలేదు. ‘మీ కోసమే వెయ్యి రూపాయలు తగ్గించాం’ అంటూ కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్లను మభ్యపెడుతూ కొత్త వసూళ్ల పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ వరుస కథనాలతో ఏర్పడిన ఒత్తిడికి తాత్కాలికంగా వసూళ్ల మొత్తాన్ని తగ్గించినా, అసలు అక్రమ వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక్కో లారీపై రూ.5600 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు మొత్తం రూ.4500కు పరిమితం చేశారు. లోడింగ్ పేరుతో రూ.2500, పట్టా (పర్దా) పేరుతో రూ.1500, జేసీబీకి రూ.200, ఇసుక లెవలింగ్‌కు రూ.300 వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ర్యాంపులో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏదో ఒక పేరుతో డబ్బులు చెల్లించకపోతే లోడింగ్ జరగదన్న పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టా పేరుతో వసూలు… కప్పడం మాత్రం లేదు!

అక్రమ వసూళ్లలో మరో కొత్త మాయ బయటపడింది. పట్టా పేరుతో రూ.1500 వసూలు చేస్తున్నప్పటికీ లారీలపై ఇసుక కప్పకుండా ర్యాంపుల నుంచి పంపిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దీని వల్ల రహదారులపై ఇసుక చల్లరేగి ప్రమాదాలకు దారి తీస్తోందని, వెనుక వస్తున్న వాహనదారులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటే సేవ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలపై కాకతీయ వరుస కథనాలు ప్రచురించడంతో నిర్వాహకుల్లో కలకలం మొదలైంది. ఈ కథనాల ప్రభావంతోనే వసూళ్ల మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించినట్లు డ్రైవర్లే చెబుతున్నారు. “వార్తలు వచ్చాయి కాబట్టే ఇప్పుడు తగ్గించారు… మళ్లీ కొద్ది రోజుల్లో పెంచుతారు” అంటూ ఒక లారీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లు టీజీఏండీసీ సిబ్బంది ముందే జరుగుతున్నాయా? అన్న ప్రశ్నకు “అందరికీ తెలిసే జరుగుతోంది” అని డ్రైవర్లు చెప్పడం మరింత సంచలనంగా మారింది.

చర్యలకు దూరంగా టీజీఏండీసీ?

ఇసుక ర్యాంపుల్లో బహిరంగంగా డబ్బులు వసూలవుతున్నా టీజీఏండీసీ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన శాఖ పూర్తిగా మౌనం వహిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల మొత్తాన్ని మార్చడమే చర్యలుగా భావిస్తున్నారా? లేక కాంట్రాక్టర్లకు మౌన మద్దతు ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు లారీ డ్రైవర్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై వివరణ కోరేందుకు కాకతీయ టీజీఏండీసీ పీఓను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img