epaper
Thursday, January 15, 2026
epaper

డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”

డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”
సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి
డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి
నకిలీ కరెన్సీ గుర్తింపుపై శిక్షణ
గౌస్ ఆలం, కరీంనగర్ పోలీస్ కమిషనర్

కాకతీయ, కరీంనగర్ : డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర’ హాలులో మంగళవారం డిజిటల్ లావాదేవీలు, సైబర్ నేరాలు, నకిలీ కరెన్సీ గుర్తింపుపై అవగాహన సదస్సును నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో సైబర్ మోసాలపై అవగాహన పెంచి, బాధితులకు వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ మోసాలను గుర్తించడంలో పోలీసు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

డిజిటల్ మోసాలపై శిక్షణ
ఇటీవల విస్తరిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, లాటరీ పేరుతో జరిగే మోసాలు, అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఖాతాలు ఖాళీ చేసే ఘటనలపై సవివరంగా వివరించారు. యూపీఐ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, తక్షణ చెల్లింపు సేవల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత ఇచ్చారు. యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పకూడదని, ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో మోసపోయినప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అసలు కరెన్సీ నోట్లలో ఉండే భద్రతా లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే విధానం, నోట్ల మార్పిడి నిబంధనలపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాలు, సైబర్ భద్రత పాటించాల్సిన మార్గాలను ప్రాయోగికంగా వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) వెంకటరమణ, ఆర్‌బీఐ అధికారులు, ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజిత్ ఘోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img