epaper
Monday, March 2, 2026
epaper

సైబర్‌ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!

సైబర్‌ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!
రూ.8.10 కోట్ల సైబర్‌ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ
పాటియాలా నివాసంలో తుపాకితో కాల్చుకున్న అమర్ సింగ్ చాహల్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం

కాకతీయ, నేషనల్ డెస్క్ : భారీ సైబర్‌ మోసం ఒక మాజీ ఉన్నతాధికారిని బలి తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ (65) సైబర్‌ ఫ్రాడ్‌లో రూ.8.10 కోట్ల వరకు నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం పాటియాలాలోని తన నివాసంలో తుపాకితో కాల్చుకున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపింది. పాటియాలాలోని తన ఇంట్లో భద్రతా సిబ్బందికి చెందిన రివాల్వర్‌తో అమర్ సింగ్ చాహల్ కాల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆయన్ని పార్క్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స ఫలించక ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం

ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల వరకు ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి రాసినట్లు సమాచారం. అందులో తాను ఎలా సైబర్‌ మోసానికి గురయ్యానో, ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. గత అక్టోబర్‌లో ఓ మోసపూరిత కంపెనీలో అమర్ సింగ్ చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. మొదట తన సొంత డబ్బు రూ.1 కోటి పెట్టగా, ఆ తర్వాత కంపెనీ నిర్వాహకుల ఒత్తిడితో స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మరిన్ని కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.8.10 కోట్ల వరకు నష్టపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మోసంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆయన లేఖలు రాసినట్లు సమాచారం.

వివాదాస్పద నేపథ్యం… కొనసాగుతున్న దర్యాప్తు

అమర్ సింగ్ చాహల్ సేవా కాలంలో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జరిగిన బెహబల్ కలాన్, కోట్‌కపురా కాల్పుల ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. తాజా ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన ఒకప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కీలకంగా పనిచేసిన అధికారి కూడా పడటం, చివరకు ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌ మోసాలపై మరింత అప్రమత్తత అవసరమన్న హెచ్చరికగా ఈ ఘటన మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img