epaper
Thursday, January 15, 2026
epaper

కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి

కొండగట్టు భూములు అంజన్నకే చెందాలి
ఫారెస్ట్ మార్కింగ్‌తో ఆలయ అభివృద్ధికి ఆటంకం
ఈవో అనుమతి లేకుండా హద్దులు తగదు
గిరి ప్రదక్షిణ భక్తులకు ఇబ్బందులు
కలెక్టర్‌కు విహెచ్‌పీ వినతిపత్రం

కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూములు పూర్తిగా దేవస్థానానికే చెందాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయ భూములను ఫారెస్ట్ భూములుగా గుర్తిస్తూ అధికారులు చేస్తున్న మార్కింగ్‌ వల్ల ఆలయ అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని విహెచ్‌పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విహెచ్‌పీ రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయానికి చెందిన భూములపై ఫారెస్ట్ అధికారులు ఏకపక్షంగా మార్కింగ్ చేయడం సరికాదన్నారు. ఆలయ ఈవో అనుమతి లేకుండా దేవభూముల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడం తగదని స్పష్టం చేశారు. వెంటనే ఈ మార్కింగ్‌ను తొలగించి ఆలయ అభివృద్ధికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలయ అభివృద్ధికి ఆటంకాలు
కొండగట్టు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని విహెచ్‌పీ నేతలు తెలిపారు. అలాంటి ఆలయానికి సంబంధించిన భూములను ఫారెస్ట్ భూములుగా చూపడం వల్ల రహదారులు, వసతి సౌకర్యాలు, భక్తుల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దేవస్థాన భూములన్నీ ఆలయ అభివృద్ధికే వినియోగించేలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భక్తులకు ఇబ్బందులు – చర్యలు కావాలి
అలాగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విహెచ్‌పీ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. భక్తుల స్వేచ్ఛాయుత దర్శనానికి, ప్రదక్షిణకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేసిన భూములన్నీ ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా దేవస్థానానికే చెందే విధంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రానికి స్పందించిన జిల్లా కలెక్టర్, కొండగట్టు ఆలయ అభివృద్ధికి అవసరమైతే అదనంగా భూములు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఆలయ భూములను ఇతరులకు అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆలయ ఈవో, డీఎఫ్ఓ, ఆర్డీఓలకు కూడా వినతిపత్రం అందజేయగా, భూములన్నీ ఆలయ అభివృద్ధి కోసమే వినియోగిస్తామని వారు భరోసా ఇచ్చినట్లు విహెచ్‌పీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బోయినిపెల్లి పద్మాకర్, జిల్లా కార్యదర్శి కస్తూరి రాజన్న, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, జగిత్యాల నగర అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్, కార్యదర్శి వడ్లగట్ట భూమేష్, ఎదురుగాట్ల పరంధాం, అనుపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img