epaper
Thursday, January 15, 2026
epaper

భారత్–న్యూజిలాండ్ సూపర్ డీల్‌

భారత్–న్యూజిలాండ్ సూపర్ డీల్‌
95% ఉత్పత్తులపై టారిఫ్ కట్!
భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏకు గ్రీన్ సిగ్నల్
9 నెలల్లోనే చరిత్రాత్మక ఒప్పందం
తొలిరోజే సగానికి పైగా ఉత్పత్తులపై సుంకం జీరో
ఇరు దేశాలకు భారీ వాణిజ్య లాభాలు

కాకతీయ, నేషనల్ డెస్క్ : భారత్–న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కేవలం 9 నెలల రికార్డు సమయంలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను పూర్తి చేసి అధికారికంగా ముద్ర వేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే 95 శాతం ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గిపోనున్నాయి లేదా పూర్తిగా రద్దు కానున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం ఈ సూపర్ డీల్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో 2025 మార్చిలో లక్సన్ భారత్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చలే ఈ ఒప్పందానికి పునాది వేసినట్లు సమాచారం.

తొలిరోజే సుంకం లేని దిగుమతులు

ఈ ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలి రోజే న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే సగానికి పైగా ఉత్పత్తులు సుంకం లేకుండానే అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి వినియోగదారులకు న్యూజిలాండ్ ఉత్పత్తులు మరింత చౌకగా, సులభంగా లభించనున్నాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన మార్కెట్ కావడంతో న్యూజిలాండ్ ఎగుమతిదారులకు ఇది బంగారు అవకాశంగా మారనుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ, మాంసాహారం, వైన్ వంటి రంగాలకు భారత్ కీలక మార్కెట్‌గా అవతరించనుంది. ఈ ఒప్పందం న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆసియా–పసిఫిక్‌లో భారత్‌కు బలం

భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే కాకుండా, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యతను మరింత బలపరిచే కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ఒప్పందంపై స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ,
“భారత్‌తో ఎఫ్‌టీఏ పూర్తైన తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఈ ఒప్పందం వల్ల న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వెళ్లే 95 శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిపోతాయి. వాణిజ్యం పెరగడం అంటే మా దేశంలో కొత్త ఉద్యోగాలు, మెరుగైన జీతాలు, ప్రజలకు కొత్త అవకాశాలు” అని వ్యాఖ్యానించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img