బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
మంత్రిని కలిపించిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్
కాకతీయ, వరంగల్ సిటీ : ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్లో గుర్రం దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు. శనివారం మంత్రి కొండా సురేఖను బాధిత కుటుంబంతో కలిపి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నివాసానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీరాం రాజేష్ తెలిపారు. అలాగే గుర్రం యజమానులతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ బొల్లం రమేష్కు ఆదేశించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, బత్తుల నవీన్ కుమార్, అక్షిత్ పటేల్, ప్రియదర్శిని, శ్రీలత, లతలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


