epaper
Thursday, January 15, 2026
epaper

గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మేడారం మార్గం మరింత అభివృద్ధి చేస్తాం
: మంత్రి సీతక్క
ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
కోటి రూపాయలతో గిరిజన బాలికల జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం
ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాల ఆవిష్కరణ
జంపన్నవాగుపై కరకట్టకు రూ.1.95 కోట్లతో శంకుస్థాపన

కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ భవనం ద్వారా విద్యార్థినులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం జంక్షన్‌లో అభివృద్ధి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ మహిళల నృత్యాల విగ్రహాలు, బాణాల విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.38 లక్షల వ్యయంతో ఈ విగ్రహాలను నిర్మించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఇవి నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

ఏటూరునాగారం మండలం బుటారం గ్రామంలో జంపన్నవాగుపై కరకట్ట నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల ఆయకట్టు శాఖ ద్వారా రూ.1.95 కోట్లతో మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ప్రతి ఏడాది వరదలతో ముంపుకు గురయ్యే బుటారం గ్రామాన్ని కరకట్ట నిర్మాణంతో రక్షిస్తామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల, సీనియర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img