బీఆర్ఎస్ నుంచి జాగృతిలో నాయకుల చేరిక
కాకతీయ, కరీంనగర్ : శంకరపట్నం మండలంలో తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు జరిగాయి. జాగృతి సీనియర్ నాయకురాలు ఎండి. సల్మా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చింతిరెడ్డి జైపాల్రెడ్డి, సోహెల్, విష్ణువర్ధన్, మహిళా నాయకురాలు సానియా, నాజీయా, అజీత్ సోనీతో పాటు సుమారు 50 మంది మహిళలు జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నూతన సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి నుంచే బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కవితక్క నాయకత్వంలో జాగృతి నిరంతర పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని హరిప్రసాద్ విమర్శించారు. ముఖ్యంగా శంకరపట్నం మండల ప్రజలకు కీలకమైన కలువల ప్రాజెక్టు పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు జాగృతి పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, మండల ఇంచార్జ్ చంటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, గాలిపల్లి రత్నాకర్ చారి, జంగ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.


