epaper
Thursday, January 15, 2026
epaper

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!
కేయూసీ ప‌రిధిలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తి అరెస్టు
సినిమాకు వెళ్లిన దంపతుల ఇంట్లో దొంగతనం
ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం
టెక్నాలజీతో నిందితుడి పట్టివేత..

కాకతీయ, వరంగల్ బ్యూరో : తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సబ్బాని రంజిత్ (24) ప్రస్తుతం హనుమకొండ పరిధిలో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంపాదనను మద్యం, జల్సాలకు ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఇతనిపై గతంలో 2020లో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు నమోదై జైలుకు వెళ్లి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబంతో కలిసి గత మూడేళ్లుగా కెయూసి పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసిస్తున్న ఓ దంపతులు ఇంటికి తాళం వేసి సినిమా వెళ్లినట్లు గమనించిన నిందితుడు, ఎవరికి అనుమానం రాకుండా తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న నాలుగు బంగారు గాజులు (40 గ్రాములు), రూ.40 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేసి పరారయ్యాడు. బాధితులు 250 గ్రాముల బంగారం చోరీ అయిందని ఫిర్యాదు చేయడంతో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి కదలికలపై నిఘా పెట్టి, శనివారం ఉదయం కెయూసి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో చోరీ చేసిన బంగారు గాజులు లభ్యమయ్యాయి.

40 గ్రాముల బంగారం స్వాధీనం..!

విచారణలో తాను కేవలం 40 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్ మాత్రమే చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించగా, బాధితుల ఇంటిని మళ్లీ తనిఖీ చేయగా మిగిలిన బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ, చోరీకి గురైన సొమ్మును అధికంగా చూపుతూ తప్పుడు ఫిర్యాదులు ఇస్తే సంబంధిత బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడి అరెస్టులో ప్రతిభ చూపిన సీసీఎస్, కెయూసి ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రవికుమార్, ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్‌స్పెక్టర్ దేవేందర్, కెయూసి ఎస్‌ఐలు శ్రీకాంత్, కిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మధుకర్, చంద్రశేఖర్, వంశీ, విశ్వేశ్వర్, ఐటీ కోర్ కానిస్టేబుళ్లు నాగేష్, ప్రవీణ్‌లను డీసీపీ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img