epaper
Thursday, January 15, 2026
epaper

కార్మిక భ‌వ‌నం మార్చిలోపు నిర్మించాలి

కార్మిక భ‌వ‌నం మార్చిలోపు నిర్మించాలి
లేదంటే 318 మంది ఫ్లాట్లు కేటాయించాలి
క‌ల్ల‌బొల్లి మాట‌ల‌తో అధికారంలోకి రేవంత్ స‌ర్కారు
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

కాకతీయ, వరంగల్ సిటీ : ఆజంజాహీ మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మార్చి 31లోపు కార్మిక భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆజంజాహీ మిల్లు కార్మిక భవన పునర్నిర్మాణ అంశంపై గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నన్నపనేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో ఆజంజాహీ మిల్లు కార్మికులకు న్యాయం చేస్తామని వరంగల్ పోస్ట్ ఆఫీస్ వద్ద అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కల్ల‌బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల భవనం స్థలంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. అనంతరం మళ్లీ కార్మిక భవనం నిర్మిస్తామని కొండా మురళి చేసిన ప్రకటనకు ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ప్రకటనలు, హామీలే తప్ప కార్మిక భవన నిర్మాణంపై కానీ, కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్ల విషయంలో కానీ స్పష్టమైన ఫలితం కనిపించడం లేదన్నారు.

మార్చి 31లోపు స్ప‌ష్ట‌తివ్వాలి

మార్చి 31లోపు కార్మిక భవనం నిర్మాణం చేపడతారా? లేక నూతన కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో 318 మంది కార్మికులకు ఫ్లాట్లు కేటాయిస్తారా? అన్న విషయంపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించిన నన్నపనేని నరేందర్… మార్చి 31లోపు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షాలు కలిసి తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. అవసరమైతే కార్మికులే చందాలు వేసుకుని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి, కార్మిక భవన నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టే బాధ్యత తనదేనని కార్మికులకు హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ మేయర్ రాజేశ్వరరావు, మాజీ ఎంపీ సీతారామనాయక్, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img