పోలింగ్ సామాగ్రిని పంపిణీ కేంద్రాలను సందర్శించిన సీపీ
కాకతీయ, వరంగల్ సిటీ : మూడవ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం దామెర, ఆత్మకూర్, శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బ్యాలెట్ పత్రాలను తరలించేటప్పుడు అలాగే రేపు జరిగే మూడవ విడత ఎన్నికల వేళ ముందస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, ఎన్నికల సిబ్బందికి సీపీ కీలక సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ వెంట అదనపు డిసిపి బాల స్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీ లు సతీష్ బాబు, సత్యనారాయణ తో పాటు స్థానిక ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.


