epaper
Monday, March 2, 2026
epaper

ఎసరు ఎదురు చూపు!

ఎసరు ఎదురు చూపు!
రేషన్ షాపుల్లో మూలుగుతున్న వరద బాధితుల బియ్యం
రెండు నెలలకు గానీ విడుదల కాని ఆహార సాయం
15 రోజులైనా పంపిణీకి నోచుకోని బియ్యం
ముహూర్తం కోసం వేచిచూస్తున్నామంటున్న అధికారులు
ఎమ్మెల్యేలు కరుణించే వరకు ఎసరు మరగాల్సిందేనా?

కాకతీయ, వరంగల్ : రెండు నెలల క్రితం వరంగల్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పలువురు సర్వస్వం కోల్పోయిన సంగతి విదితమే. కొన్నిచోట్ల ఇంట్లో సామగ్రి కూడా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. వరద తగ్గుముఖం పట్టాక ఎప్పటిలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. పరామర్శించారు. ముఖ్యమంత్రి సైతం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా, వరద బాధితులకు బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆ బియ్యం ఇప్పుడు రేషన్ షాపుల్లో మూలుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15రోజులుగా ఆ బియ్యం ఎసరు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు కరుణిస్తేనే!

వరంగల్, ఖిల్లా వరంగల్ మండల పరిధిలలో వరద బాధితులకు మంజూరైన బియ్యం రేషన్ షాపులకు చేరాయి. వరంగల్ లోని పైడిపల్లి పరిధిలో 21 కుటుంబాలు.. 61 మందికి మనిషికి ఆరు కిలోల చొప్పున 366 కిలోలు, ఏనుమాముల పరిధిలో 81 కుటుంబాలు.. 243 మందికి 1458 కిలోలు, గిర్మాజీపేట పరిధిలో 101 కుటుంబాలు.. 286మందికి 1716 కిలోలు, రామన్నపేట పరిధిలో 1415 కుటుంబాలు.. 4317 మందికి 25902 కిలోలు కాగా వరంగల్ మండల పరిధిలో మొత్తంగా 1620 కుటుంబాల్లో 4907 మందికి గాను 29442 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. అలాగే ఖిల్లా వరంగల్ మండల పరిధిలో 1417 కుటుంబాలల్లో 4630 మందికి ఆరు కిలోల చొప్పున 27780 కిలోల బియ్యాన్ని డిసెంబర్ 5న ఆయా రేషన్ డీలర్లకు విడుదలయ్యాయి. వీటిని పంపిణీ చేసేందుకు ఒక్కో ఏరియాకు అధికారులను కూడా నియమించారు. ఏయే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలో కూడా నివేదిక సిద్ధం చేశారు. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఈ బియ్యం పంపిణీకి ఎమ్మెల్యేల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల చేతులమీదుగా పంపిణీ చేయాలని, వారి కోసమే ఎదురుచూస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి..!

వరదల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారికి తక్షణ సాయం కింద ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాల్సింది పోయి.. వరదలు వచ్చి రెండు నెలలకు గానీ సర్కారు కళ్లు తెరవలేదు. దానికి కూడా ఎమ్మెల్యేల రూపంలో పంపిణీకి ఆటంకాలు ఏర్పడడం ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే పాలకుల తీరు హాస్యాస్పదం అనిపిస్తోంది. ఇప్పటికే బియ్యం డీలర్ల వద్దకు చేరకుని 15రోజులు దాటుతోంది. మరి ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేమని అధికారులు పేర్కొనడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు లేదా మంత్రి స్పందించి.. వారున్నా లేకపోయినా.. బియ్యం పంపిణీకి అనుమతిస్తారని ఆశిద్దాం! లేదంటే.. మతిలేనోడు దుకాణం పోతే.. ఇంట్లో ఎసరు మరిగి ఆవిరైనట్లుగా ఉంటుంది.. వరద బాధితుల బియ్యం పంపిణీ!

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img