epaper
Monday, March 2, 2026
epaper

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దు
*మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి విడత, రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామపంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ పంచాయతీరాజ్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 5,856 గ్రామాలకు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. గత రెండేళ్లుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ, అక్కడే అది ఆగిపోయిందన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు రావాలంటే మార్చిలోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించామని స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పరిపాలన, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్రులు కూడా విజయం సాధించారని మంత్రి తెలిపారు. స్థానిక సమస్యల కారణంగా కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ రెబల్స్ నాలుగు గ్రామాల్లో గెలుపొందారని పేర్కొన్నారు. ఇది ములుగు నియోజకవర్గ ప్రజల విజయం అని, కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడి విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల జనరల్ సీట్లలో కూడా బీసీ అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందని, దీనిని సహించలేక కొందరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా “సీతక్క గడ్డమీద షాక్” అనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి సొంత గ్రామమైన దేవగిరిపట్నంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, కాల్వపల్లి గ్రామంలో కూడా కాంగ్రెస్ గెలిచిందని ఆమె గుర్తు చేశారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించినందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకుని ప్రజల అభివృద్ధికి సహకరించి కనీస రాజకీయ మర్యాద పాటించాలని మంత్రి సీతక్క హితవు పలికారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ బొక్కా సత్తి రెడ్డి, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img