epaper
Thursday, January 15, 2026
epaper

ఏఐలో దూసుకెళ్తున్న ప్ర‌పంచ దేశాలు.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?

ఏఐలో దూసుకెళ్తున్న ప్ర‌పంచ దేశాలు.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదికలో భార‌త్ స‌త్తా
నాలుగు స్థానాలు ఎగబాకి టాప్‌–3లో చోటు
అభివృద్ధి చెందిన దేశాలకే షాక్‌ ఇచ్చిన ఇండియా ర్యాంక్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ దేశాల మధ్య కొత్త తరహా పోటీకి తెరలేపింది. ఒకప్పుడు టెక్నాలజీ సహాయక సాధనంగా మాత్రమే భావించిన ఏఐ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు, జాతీయ భద్రత, పాలన, ఉపాధి రంగాల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక శక్తిగా మారింది. అయితే ఈ గ్లోబల్ ఏఐ రేసులో భారత్‌ ఊహించని వేగంతో దూసుకెళ్తోంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది.

స్టాన్‌ఫోర్డ్ రూపొందించిన ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ ప్రకారం… భారత్‌ ఏఐ అభివృద్ధి, వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే భారత్‌ ఏకంగా నాలుగు స్థానాలు ముందుకు రావడం విశేషం. పరిశోధన–అభివృద్ధి, నైపుణ్యాలు, పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, ప్రజాభిప్రాయం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేశారు.

ఈ సూచీలో అమెరికా 78.6 స్కోర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెక్నాలజీ దిగ్గజాలు, విశాల పెట్టుబడులు, పరిశోధన సామర్థ్యం అమెరికాను ముందుండేలా చేశాయి. ఇక చైనా 36.95 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. సెమీకండక్టర్లు, ఏఐ పరిశ్రమలపై భారీ పెట్టుబడులు చైనా బలంగా మారడానికి కారణమయ్యాయి. ఈ రెండు దేశాల తర్వాత భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని దక్కించుకోవడం గ్లోబల్ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా ఐటీ రంగంలో భారత్‌కు ఉన్న అనుభవం, స్టార్టప్ సంస్కృతి, యువ నైపుణ్యవంతుల సంఖ్య ఈ ఎదుగుదలకు బలమయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా సౌత్ కొరియా(17.24), యునైటెడ్ కింగ్‌డమ్(16.64), సింగపూర్(16.43), స్పెయిన్(16.37), యూఏఈ(16.06), జపాన్(16.04) వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ ర్యాంకింగ్స్‌లో భారత్‌ కంటే దిగువ స్థానాల్లోనే ఉన్నాయి. ఇది భారత్‌ ఏఐ రంగంలో సాధించిన పురోగతికి స్పష్టమైన నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏఐ ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ ప్రభుత్వాలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా సెమీకండక్టర్ పరిశ్రమ కోసం బిలియన్ల డాలర్ల నిధులు కేటాయిస్తే, ఫ్రాన్స్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు వందల బిలియన్ల పెట్టుబడులను ప్రకటించాయి. భారత్‌ కూడా జాతీయ ఏఐ మిషన్‌, స్టార్టప్ మద్దతు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ఈ రేసులో వేగం పెంచుతోంది. భారత్‌ దూకుడు ఇదే విధంగా కొనసాగితే రానున్న సంవత్సరాల్లో ఏఐలో మరింత పైస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయ‌ని నిపుణుల అభిప్రాయప‌డుతున్నారు. మొత్తంగా చూస్తే… ఏఐ రేసులో భారత్‌ ఇప్పుడు ఫాలోవర్ కాదు, ఫ్రంట్‌రన్నర్‌గా మారుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img