epaper
Thursday, January 15, 2026
epaper

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది
క్రమశిక్షణ, కఠిన శ్రమతో ఏ రంగంలోనైనా విజయం సాధ్యం
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

కాక‌తీయ‌, హనుమకొండ : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డా. కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. హనుమకొండ పెద్దపెండ్యాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ‘ఆరోహన్–2025’ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు వైఫల్యాలను భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా మలచుకోవాలని, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కెరీర్ ఎంపికలో ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ ఇష్టాలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఎంపీ సర్టిఫికెట్లు, మెమెంటోలను అందజేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో నిట్‌ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుద్ధి, డీపీఎస్ డైరెక్టర్ రాజి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇన్నా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img