epaper
Thursday, January 15, 2026
epaper

ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల కృషిని గుర్తించాలి: TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలనీ TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

దాదాపు 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం , సమస్యల పరిష్కారం కోసం , సంక్షేమం కోసం, వారి ఐక్యత కోసం TPTF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగుతదనీ, అందుకు మీ అందరి భాగస్వామ్యం కూడా చాలా అవసరమనీ , మీరు ఛైతన్యమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులకు 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. వారి అర్హతకు తగిన జీతం లేదు, సమయానికి జీతాలు రావు. ప్రభుత్వ సెలవులు ఉండవు, ప్రభుత్వ సమయ వేళలు ఉండవు. 12 నెలల జీతం ఉండదు, ESI, PF వంటి సౌకర్యాలు ఉండవు. ఇన్ని సమస్యలతో చెలగాటం ఆడుతూ మరోపక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులు.

పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయుల శిక్షణలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడం మన కృషికి నిదర్శనం. మరి ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులను ఎవరు గుర్తిస్తున్నరు? ఎవరు గౌరవిస్తున్నరు? ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5 న జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారిని ఎందుకు గుర్తించి సత్కరించడం లేదు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలతో సత్కరించాలనీ కోరారు. ఈ సమావేశంలో గీసుగొండ మండల అధ్యక్షుడు దామెర సూర్యచంద్ర, సంగెం మండల అధ్యక్షుడు ఎల్కుర్తి రవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా, గీసుగొండ మండల ఉపాధ్యక్షులు అశోక్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img