epaper
Monday, March 2, 2026
epaper

చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్ ప్లాన్.. బ‌ట్ భారత్‌కు నో ఎంట్రీ!

చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్ ప్లాన్.. బ‌ట్ భారత్‌కు నో ఎంట్రీ!
సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు
ప్యాక్స్‌ సిలికాలో భారత్ కు ద‌క్క‌ని చోటు
మోదీ స‌ర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ శక్తిసమీకరణ వేగంగా మారుతోంది. ముఖ్యంగా సిలికాన్‌ ఆధారిత హైటెక్‌ సరఫరా గొలుసులపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యానికి బ్రేక్ వేయాలనే లక్ష్యంతో అమెరికా కీలక అడుగు వేసింది. అదే ‘ప్యాక్స్‌ సిలికా’. అమెరికా విదేశాంగ శాఖ ప్రారంభించిన ఈ కొత్త ప్రోగ్రామ్‌ ఏఐ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పటికీ, ఇందులో భారత్‌కు చోటు దక్కకపోవడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, నెదర్లాండ్స్‌, యూకే, ఇజ్రాయెల్‌, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి టెక్నాలజీ శక్తివంతమైన దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. సిలికాన్‌, సెమీకండక్టర్‌ సరఫరా విషయంలో ఒకే దేశంపై, ముఖ్యంగా చైనాపై ఆధారపడకుండా ఉండటమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. ఏఐ పరికరాలు, చిప్‌లు, అత్యాధునిక టెక్నాలజీల అభివృద్ధిని భద్రపరచడం కూడా ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యాల్లో కీలకం.

అయితే, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న టెక్‌ మార్కెట్‌లలో ఒకటైన భారత్‌కు ఈ కీలక కూటమిలో ఎంట్రీ ల‌భించ‌క‌పోవ‌డం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనే అమెరికా ప్రయత్నాల్లో భారత్‌ సహజ భాగస్వామి కావాల్సిందని, కానీ అది జరగకపోవడం భారత విదేశాంగ వైఫల్యమేనని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ–డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సంబంధాల్లో ఏర్పడిన అపార్థాలే ఇందుకు కారణమై ఉండవచ్చని కాంగ్రెస్‌ ఎద్దేవా చేస్తోంది.

మరోవైపు, అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ప్రోగ్రామ్‌ వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. సిలికాన్‌ సరఫరా విషయంలో బలవంతపు ఆధారపడకూడదనే లక్ష్యంతోనే ‘ప్యాక్స్‌ సిలికా’ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఏఐకు సంబంధించిన సామర్థ్యాలను రక్షించడం, ఆధునిక సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ కూటమి ప్రధాన ఎజెండా అని పేర్కొంది.

ఇదిలా ఉండగా, భారత్‌ ఏఐ రంగంలో వెనుకబడి లేదన్న వాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌ 2026’ నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిర్వహించబడుతున్న తొలి ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం. అయితే, గ్లోబల్‌ ఏఐ కూటములు ఒకవైపు, భారత్‌ స్వతంత్ర ప్రయత్నాలు మరోవైపు సాగుతుండటం భవిష్యత్తులో ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img