మెస్సీకి గ్రాండ్ వెల్కమ్.. మెస్సి నినాదాలతో ఊగిపోయిన కోల్కతా
It was 3:30AM Saturday morning people in the streets lined up, welcoming Messi as his car passes by. Thank You India.🙏🇮🇳
pic.twitter.com/MtsLgvnSer— Messi Fanatic (@MessiFanatic_) December 12, 2025
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సా ఇండియాకు చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు కోల్కతాకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. కోల్కతా వాసులు విమానాశ్రయంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పగా.. మెస్సీ హోటల్కు చేరుకునే క్రమంలో ప్రధాన రహదారుల వెంట.. ప్లకార్డులు చూపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. మెస్సీ నినాదాలతో కోల్కతా నగరం మార్మోగింది.శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టుతో జరిగే ఫ్రెండ్లీ మ్యాచులో పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, వ్యాపార వేత్తలు తరలి వస్తున్నారు.


