epaper
Thursday, January 15, 2026
epaper

మంథనిలో నమ్మ‌కద్రోహ రాజకీయాలు

మంథనిలో నమ్మ‌కద్రోహ రాజకీయాలు
ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌పై పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు

కాకతీయ,మంథని : మంథని నియోజకవర్గంలో నమ్మిన నాయకులకే ద్రోహం చేయడం దుద్దిళ్ల శ్రీధర్ రాజకీయ శైలిగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడిన నాయకులను సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక సమయంలో పూర్తిగా పక్కనబెట్టడం దారుణమన్నారు.ప్రజల్లో, కార్యకర్తల్లో ఎమ్మెల్యేపై నమ్మకం పూర్తిగా కోల్పోయిందని, ఇదే విషయాన్ని వరుసగా హెచ్చరిస్తున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇవ్వడం, మాట తప్పడం, నమ్మిన వారిని మోసం చేయడం ఆ కుటుంబం రాజకీయాల్లో సాధారణమైందని ఎద్దేవా చేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశ్వాసంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను పక్కకు నెట్టివేసి బీఆర్‌ఎస్ నేతలకు కండువాలు కప్పి ఏకగ్రీవాలు చేయించడమే శ్రీధర్ నిజస్వరూపమన్నారు. మైదుపల్లి, చందనాపూర్, మహాదేవ్‌పూర్‌ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులకు అవకాశమే ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి రేపిందని పేర్కొన్నారు.చందనాపూర్‌లో ఎన్నేళ్లుగా పార్టీ కోసం పోరాడిన బాబుమియా వంటి నేతను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనే ఈ స్థాయి నమ్మకద్రోహం చేస్తే, రాబోయే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా ఎలాంటి రాజకీయ కుతంత్రాలకు శ్రీధర్ తెగబడతాడో పార్టీ నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీ నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి ఇప్పటివరకు ఒక్కరినైనా సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.మూడువందల కుటుంబాల ఆధారంతో 40 ఏళ్లుగా అధికారం తమ సొత్తుగా భావించే ఆ కుటుంబం ప్రజలనూ, నమ్మిన కార్యకర్తలనూ వరుసగా మోసం చేస్తోందని మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించాలని, వారి నీతిహీన రాజకీయ శైలిని ప్రత్యక్షంగా చూశానని, అందుకే పదే పదే హెచ్చరిస్తున్నానని అన్నారు.నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే శ్రీధర్‌ను 420 హామీలు ఇచ్చే దొంగ ఎమ్మెల్యే గా భావిస్తున్నారని, మహాదేవ్‌పూర్‌లో రాత్రికి రాత్రే అభ్యర్థులు మార్పు కూడా అదే మోసపూరిత ధోరణికి ఉదాహరణనని మధూకర్ ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img