epaper
Thursday, January 15, 2026
epaper

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

కాకతీయ, కరీంనగర్ : దశాబ్దాల పాటు దేశం,రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని,2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల పట్ల నిజమైన స్పృహతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవం, వారి సమస్యలు కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం ప్రాధాన్యం పొందలేదని అన్నారు.పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసే దిశలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అపార కృషి చేసిందని కళ్యాణ్ చంద్ర పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువలు, డంపింగ్ యార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు వంటి అనేక కీలక పనులు భారీగా పూర్తవ్వడం మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.గ్రామాల్లో మహిళలు గౌరవంగా జీవించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, కట్టెల పొయ్యిల బాధల నుంచి విముక్తి కల్పించిన ఉజ్వల గ్యాస్ యోజన వంటి పథకాలు గ్రామీణ కుటుంబాలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. నేడు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచులను దయనీయ స్థితికి నెట్టివేసిందని ఆరోపించిన ఆయన, గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక అనేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బీఆర్‌ఎస్ పాలనలోనే వచ్చిందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సర్పంచులను అప్పుల బారిన పడేసిందని తెలిపారు. గ్రామాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం తొందరపడి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో జరిగిన పనులకు కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేయడం దండగ అయిందని, గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మాయ మాటలకు మోసపోకుండా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వేల కోట్లు మంజూరు చేయించారని కళ్యాణ్ చంద్ర తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img