epaper
Monday, March 2, 2026
epaper

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

కాకతీయ, కరీంనగర్ : దశాబ్దాల పాటు దేశం,రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని,2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల పట్ల నిజమైన స్పృహతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవం, వారి సమస్యలు కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం ప్రాధాన్యం పొందలేదని అన్నారు.పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసే దిశలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అపార కృషి చేసిందని కళ్యాణ్ చంద్ర పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువలు, డంపింగ్ యార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు వంటి అనేక కీలక పనులు భారీగా పూర్తవ్వడం మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.గ్రామాల్లో మహిళలు గౌరవంగా జీవించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, కట్టెల పొయ్యిల బాధల నుంచి విముక్తి కల్పించిన ఉజ్వల గ్యాస్ యోజన వంటి పథకాలు గ్రామీణ కుటుంబాలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. నేడు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచులను దయనీయ స్థితికి నెట్టివేసిందని ఆరోపించిన ఆయన, గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక అనేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బీఆర్‌ఎస్ పాలనలోనే వచ్చిందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సర్పంచులను అప్పుల బారిన పడేసిందని తెలిపారు. గ్రామాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం తొందరపడి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో జరిగిన పనులకు కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేయడం దండగ అయిందని, గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మాయ మాటలకు మోసపోకుండా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వేల కోట్లు మంజూరు చేయించారని కళ్యాణ్ చంద్ర తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img