పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలు
హుజురాబాద్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు
కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పండగ సాయన్న ముదిరాజ్ 1860 ప్రాంతం నుండి 1900 కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూన్న నిరంకుశ పాలనను వ్యతిరేకించి జమిందారి దేశ్ముఖలకు వ్యతి రేకంగా పోరాడిన దీశాలి పండుగ సాయన్న ముదిరాజ్ ని సంపన్న వర్గాలను కొల్లగొట్టి పేద వర్గాలకు పంచిన తెలంగాణ రాబిన్ హుడ్, సాయన్న ముదిరాజ్ అని వారు కొనియాడారు. అంతే కాకుండా ప్రత్యేక బీసీ సామ్రాజ్యం కోసం సామాజిక న్యాయం దిశగా పోరాటాలు చేస్తూ బీసీలసామ్రాజ నిర్మాణానికి కృషి చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్, బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొలిపాక శంకర్, సొల్లు బాబు, వేల్పుల రత్నం, రిటైర్డ్ హెచ్ఎం జిల్లా దాసరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసి లక్ష్మణమూర్తి, మైనార్టీ నాయకులు ఖలీద్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ ముక్కా రమేష్, ఉప్పు శ్రీనివాస్, కేఆర్ బిక్షపతి మంద 25వ వార్డు సభ్యులు, న్యాయవాదికామణి సమ్మయ్య, మమునూరు ప్రవీణ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎర్రబోజు నారాయణ, అనగోని శ్రీనివాస్, బత్తుల మనోజ్, పివి జిల్లా సమితి సభ్యులు కుమార్ గోపి, కొలిపాక శ్రీనివాస్, మటేడ ప్రకాష్, తూం వెంకట్రెడ్డి, జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


