epaper
Thursday, January 15, 2026
epaper

నాకు మాయ మాటలు చెప్పడం రాదు

నాకు మాయ మాటలు చెప్పడం రాదు
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కాకతీయ, గీసుగొండ : తనకు మాయమాటలు చెప్పడం రాదని, ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే వ్యక్తిని కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని శాయంపేట హవేలీ,ఊకల్ హవేలీ,మరియాపురం, గంగాదేవిపల్లి,కొనాయిమాకు,ఎలుకుర్తి హవేలీ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వారిని పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయమే గ్రామాల అభివృద్ధికి దారితీస్తుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులను గెలుపులోకి తెచ్చాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మంచి పాలన, పారదర్శకత, ప్రజా సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే రేవూరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు, యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి..

ఆత్మకూరులో కేంద్రంలోని జీ‌ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఆత్మకూరు, దామెర, నడికుడ మండలాల కాంగ్రెస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశంలో కూడా ఎమ్మెల్యే రేవూరి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని, గత రెండు సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని, అధికార పార్టీ సర్పంచులు గెలిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img