epaper
Thursday, January 15, 2026
epaper

కాక‌తీయుల మ్యూజియం ప్రారంభ‌మెప్పుడు..?

కాక‌తీయుల మ్యూజియం ప్రారంభ‌మెప్పుడు..?
నిర్మాణం పూర్త‌యి మూడేళ్లు.. ప్రారంభించ‌కుండా నిర్ల‌క్ష్యం
కోట్ల రూపాయల నిర్మాణం పోకిరీల పాలు.. పటించుకొని పర్యాటక శాఖ
కాకతీయుల ఘన చరిత్రను ప్రస్తుత తరానికి అందించలేమా?

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్  జిల్లా లోని ఓరుగల్లు కోట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజుల రాజధాని ఓరుగల్లు కోట ఎంతో అభివృద్ధి చెందింది కానీ ఇప్పటి పాలకుల నిర్లక్ష్యానికి ఓరుగల్లు కోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చారిత్రక కట్టడాలను పరిరక్షించి టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం హృదయ్  పథకం ద్వారా వందల కోట్లు నిధులు విడుదల చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వలన ఓరుగల్లు కోట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. పురావస్తు శాఖ మ్యూజియం నిర్మాణం 80% పూర్తయినప్పటికీ, మిగిలిన పనులకు నిధులు లేకపోవడంతో ఆలస్యం అవుతోందని అధికారులు అంటున్నారు . ఇప్పటికే జీడ‌బ్ల్యూఎంసీ కార్యాలయం వెనుక ఉన్న పాత మ్యూజియంలో 1200కి పైగా కాకతీయ కాలం వస్తువులు భద్రపరిచి ఉన్నాయి.
2024 ఆగస్టులో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్‌ను ఎకో, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి, సెప్టెంబర్ 9న మ్యూజియం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ  మంత్రి ప్రణాళిక ప్రయత్నాలు కూడా సఫలం  కాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పర్యాటకులు, స్థానికులు మ్యూజియం ఆలస్యంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల అలసత్వంతో అంధకారంలో..

కేంద్ర పురావ‌స్తు శాఖ మంజూరు చేసిన నిధుల‌తో దాదాపు ఎక‌రం విస్తీర్ణంలో నిర్మించిన మ్యూజియం భ‌వ‌నం మూడేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ఖిలావ‌రంగ‌ల్ శిల్పాల ఆవ‌ర‌ణ‌కు స‌మీపంలోనే దీన్ని నిర్మించిన అధికారులు, కాక‌తీయుల క‌ళావైభవాన్ని తెలిపే మ్యూజియంగా మ‌ల్చడంలో మాత్రం పూర్తిగా వైఫ‌ల్యం చెందుతున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన మ్యూజియాన్ని అధికారులు గాలికి వదిలేసారు. కాకతీయుల కాలం నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన రాతి విగ్రహాలు, అప్పటి పనిముట్లు, బంగారు నాణేలు, బంగారు ఆభరణాలు, ముఖ్యమైన తాళపత్ర గ్రంథాలు, యుద్ధానికి వాడిన‌ రాతి ఫిరంగులు, కాకతీయుల వైభవం ఉట్టి పడేలా ఉండే వారి అపురూప కట్టడాలు ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందిన చారిత్రక సంపదతో క‌ళ‌క‌ళ‌లాడ్సిన‌ మ్యూజియం ఖాళీగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం కొంత‌మంది మ‌ద్యం సేవించేందుకు, పేకాట‌కు, ఇంకా అనేక అసాంఘిక కార్యక‌లాపాల‌కు వినియోగించుకుంటున్నారు.కాక‌తీయుల శిల్పాల‌ను, జీవ‌న విధానాన్ని, ప‌రిపాల‌న‌ను, చారిత్రక ఆన‌వాళ్లను, ఆధారాల‌ను, పురావ‌స్తుశాఖ సేక‌రించిన ప‌రిక‌రాల‌ను, నాణెల‌ను, చారిత్రక గ్రంథాల‌ను ఇలా కాకతీయుల స‌ర్వ స‌మాచారాన్ని ఒక్కచోట చేర్చి సంద‌ర్శకుల‌కు తెలియ‌జేయాల‌నే ఉన్నత ల‌క్ష్యంతో మ్యూజియం ఏర్పాటుకు పాదుకోల్పారు. అయితే కేంద్ర, రాష్ట్ర పురావ‌స్తు శాఖ అధికారులు, టూరిజం శాఖ అధికారులు సంయుక్తంగా నిర్లక్ష్యం వ‌హిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. భ‌వ‌నం సిద్ధంగా ఉన్నప్పటికి శిల్పాల‌ను త‌ర‌లించ‌డం, ఇత‌ర‌త్రా మౌలిక వ‌స‌తులు, మ్యూజియంకు కావాల్సిన విధంగా భ‌వ‌నాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చక‌పోవ‌డం గ‌మనార్హం.

భద్రతలో అధికారుల అలసత్వం

చారిత్రక నైపుణ్యం తో ఎంతో వైభ‌వంగా వ‌ర్ధిల్లిన కాక‌తీయుల శిల్పా క‌ట్టడాలు త‌రుచూ ఎక్కడో ఓ గ్రామంలో బ‌య‌ల్పడుతూనే ఉన్నాయి.ఇలా వెలుగు చూస్తున్న క‌ట్టడాల ప‌రిర‌క్షణ‌కు చ‌ర్యలు మాత్రం శూన్యంగానే మిగులుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. వాటి మ‌హోన్నత్వాన్ని జ‌నాల‌కు తెలియ‌జేయ‌డంలో పురావ‌స్తు శాఖ అధికారుల వైఫ‌ల్యం క‌నిపిస్తోంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. నిడిగొండ, నీరుకుళ్ళ, మడికొండ, మొగిలిచెర్ల, రామానుజపురం, వేల్పుగొండ, ప‌ర్లప‌ల్లి, రేగొండ లాంటి ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో శిథిల శిల్పాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపిస్తోంది. ఇక్కడ ఏ చిన్న తవ్వకం జరిపినా ఏదో ఒక శిథిల శిల్పమో, లేదా ఏ పురాతన కట్టడం తాలూక అవశేషమో బయటపడుతుంది. వీటి విలువ, ప్రాముఖ్యత తెలియని గ్రామస్థులు ఆ రాళ్లను, శిల్పాల‌ను ఇళ్ళ పునాదులకో, లేక ఇతరత్రా నిర్మాణాలకు వాడుకుంటున్నారు. వాటిని పరిరక్షించాల్సిన అధికారులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.

ప్రారంభానికి పర్యాటకుల ఎదురు చూపులు

కాక‌తీయుల చరిత్రను నిక్షిప్తం చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్లక్ష్యానికి గురైన కాకతీయుల కళాసంపదను ఒక్క చోట చేర్చి ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియంగా ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు అధికారులు ప్రతిపాద‌న‌లు కూడా పంపారు. అదే స‌మ‌యంలో కాక‌తీయుల క‌ళా సంప‌ద‌ను గుర్తించేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వంద‌ల సంఖ్యలో శిల్పాల‌ను స‌ర్వేల్లో గుర్తించారు. అయితే గుర్తించిన అతికొన్ని మాత్రమే శిల్పాల ఆవ‌ర‌ణ‌కు చేరుకున్నాయి. ఇంకా అనేకం ఎక్కడివ‌క్కడే అన్నట్లుగా ఉన్నాయి. వాట‌న్నింటిని ఖిలావ‌రంగ‌ల్‌లోని శిల్పాల ఆవ‌ర‌ణ‌కు లేదా కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియంకైనా త‌ర‌లించాల‌ని ప్రజ‌లు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img