epaper
Saturday, January 17, 2026
epaper

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం

కొత్త భవనంలోకి మారనున్న పాత కార్యాల‌యం

సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా తుది దశకు నిర్మాణం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) భవనం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పీఎంవో భవనం పేరును సేవాతీర్థ్​గా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎంవోను ఇక నుంచి సేవాతీర్థ్‌గా పిలవనున్నారు. ప్రధానమంత్రి దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా, ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇంతకుముందు ఈ భవనాలను ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్​గా పిలిచేవారు. అయితే పరిపాలనలో సేవా భావం ప్రాముఖ్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది.

ఏఏ కార్యాలయాలు ?

కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో పీఎంవోతోపాటు కేబినెట్ కార్యదర్శిత్వం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ , ఇండియా హౌస్ ముఖ్యంగా ఉండనున్నాయి. ఇందులోని ఇండియా హౌస్ ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధులు, ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపే కేంద్రంగా రూపొందుతోంది. దేశ విదేశాంగ వ్యవహారాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. పరిపాలన అనేది కేవలం అధికారాన్ని ప్రదర్శించే స్థలం కాదు, ప్రజలకు సేవలందించే కేంద్రం కావాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. “సేవా తీర్థ్ అనేది సేవా భావాన్ని ప్రతిబింబించే పని ప్రదేశం. దేశ ప్రాధాన్యాలు, జాతీయ నీతులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి” అని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన మార్పు జరుగుతోందని వారు పేర్కొన్నారు. అధికారం నుంచి సేవాభావం వైపు, ఆధిపత్యం నుంచి బాధ్యత వైపు మార్పు జరుగుతోందని వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img