epaper
Monday, December 1, 2025
epaper

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!
ఒక్కో డివిజన్ కు 50లక్షలు ఇస్తున్నాం..
పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డివిజన్లకు ఎక్కువ!
వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు
బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే నాయిని వెల్లడి
త్వరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ప్రకటన
భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరణ

కాకతీయ, వరంగల్ : గతంలో ఎన్నడు లేనంతగా గడిచిన రెండేళ్లలో వరంగల్ నగర అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పడంలో తడబడ్డారు. సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న రూ. 5భోజనానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం ఒక్కో డివిజన్ అభివృద్ధి కోసం రూ. 50లక్షలు కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వరద ముంపు బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నిధుల వివరాల్లో తడబాటు..

అధిక మొత్తంలో తెచ్చిన నిధులు వివరాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా ఎమ్మెల్యే నాయిని తడబడ్డారు. ఆ వివరాలు కచ్చితంగా తెలియదని, మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని పేర్కొనడం గమనార్హం. ఒక్కో డివిజన్ కు రూ.50లక్షలు కేటాయించగా, హన్మకొండ ఎమ్మెల్యే పరిధిలోని కొన్ని డివిజన్లకు కోటికిపైగా నిధులు ఎలా కేటాయించారని ప్రశ్నించగా, అక్కడ కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువు విస్తీర్ణం 360 ఎకరాల నుంచి 130 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇక నగరంలో ముంపు నివారణ కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ నిర్మిస్తామని, త్వరలో ఆ పనులు ప్రారంభిస్తామని నాయిని వెల్లడించారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసహనం
కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం వచ్చిన ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు వస్తున్నారా? లేదా వారితో ముప్పు ఉందా అంటూ నిలదీశారు. కౌన్సిల్ సమావేశంలో చాకలి ఐలమ్మ భవనానికి నిధులు కేటాయించలేదని ఈ జెండా ప్రతులను చించి ఎగరేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశం అనంతరం కూడా ఆయన్ను మాట్లాడాలని విలేకరులు కోరగా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఆయన్ను కారులో ఎక్కించి పంపించారు. దీంతో ఆయన్ను మాట్లాడకుండా చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అబ్బనికుంట వాసుల నిరసన

కౌన్సిల్ సమావేశం వేళ అబ్బనికుంటవాసులు బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అబ్ద్బనికుంటలో రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా, అర్ధంతరంగా వదిలేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన మహిళలు, మధ్యాహ్నం 3గంటలకు కూడా సమావేశం ముగిశాక తమ నిరసనను వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎమ్మెల్యే స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

ఎమ్మెల్యే స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరికలు కాకతీయ పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి...

యువతి పై కెమికల్ రసాయనంతో దాడి…

యువతి పై కెమికల్ రసాయనంతో దాడి... కాకతీయ, వరంగల్ సిటీ : కడిపికొండ...

తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి

తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ,గీసుగొండ...

ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం

ఘనంగా కంఠమహేశ్వర స్వామి కల్యాణం కాకతీయ,రాయపర్తి : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండలంలోని...

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు?

ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు? మెడికవర్ ఆస్పత్రిలో పేషెంట్ మృతిపై...

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!

కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్య‌ను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త! కోయంబత్తూరులో...

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్ కాకతీయ, ములుగు ప్రతినిధి...

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కాకతీయ, జనగామ : జనగామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img