epaper
Thursday, January 15, 2026
epaper

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్

  • మాజీ మంత్రి వసత్యవతి రాథోడ్
  • మ‌హ‌బూబాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్
  • కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కాకతీయ, మహబూబాబాద్ : చావు నోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్న‌మైన రాష్ట్రాన్ని సాధించార‌ని మాజీమంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఉద్యమ దశలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర విభజనకు శంకుస్థాపన చేసిందని, ఆ దీక్ష దేశ రాజకీయాలను ప్రజాస్వామ్యం దిశగా ఆకర్షించిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి సూచికల్లో ముందంజలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. రైతు కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా దేశానికి అన్నం పెట్టే రైతన్నకు గౌరవం తీసుకువచ్చిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలతో ఉద్యమ జ్ఞాపకాలను తలచుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం చేశారు. ఆనాటి ఉద్యమ జ్వాలల్ని మరోసారి గుర్తుచేసుకుని, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణను కాపాడుకోవాలి, అని సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

తరువాత తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, బానోత్ శంకర్ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, మాజీ ఒడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్లు యండి ఫరీద్, మార్నేని వెంకన్న, బొడ శ్రీను, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, కత్తుల ఏలేందర్, అర్జున్ చౌహన్, బాలు, మార్నేని రఘు, కె ఎస్ ఎన్ రెడ్డి, దుర్గేశ్, ముత్యం వెంకన్న, ఊకంటి యాకుబ్ రెడ్డి, బానోతు రవికుమార్, కాజా మియా, బండి దీపక్ గౌడ్, కన్న, జీవన్, బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img