epaper
Thursday, January 15, 2026
epaper

కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు

కేంద్ర నిధులకోసమే పంచాయతీ ఎన్నికలు
బీజేపీ నేత బాస సత్యనారాయణ

కాకతీయ, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నిజమైన కారణమే కేంద్రం నిధులని, గ్రామాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో మహాత్మా నగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రతి రూపాయిని కేంద్రం పంపుతుందనీ, ప్రజల ఇళ్లలో వెలిగే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ నుంచి రోడ్లు, వీధి లైట్లు, రేషన్ బియ్యం, ఉపాధి హామీ కింద 100 రోజుల పనులు వరకు అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వమే అందజేస్తోందని సత్యనారాయణ పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, కందకాల తవ్వకాలు, ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులకు నరేగా నిధులే బలమని చెప్పారు. ఎక్కడా లేని విధంగా బండి సంజయ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, బోర్లు, డ్రైనేజీలు నిర్మించారని తెలిపారు. సీఎస్సార్ నిధులను సమీకరించి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించారని గుర్తు చేశారు. పదవ తరగతి విద్యార్థులకు 20 వేల సైకిళ్ల పంపిణీ, పరీక్షా ఫీజుల చెల్లింపులు, ‘మోదీ గిఫ్ట్’ పేరిట ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చిన విషయాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేసిందా? ఎమ్మెల్యేల దగ్గర ఊరిని బాగుచేయడానికి సొంత నిధులున్నాయా? గత ప్రభుత్వ కాలంలో నిధుల లేమితో సర్పంచులు పడిన ఇబ్బందులు, ఆత్మహత్యలకు వెళ్లిన సంఘటనలను ప్రజలు మరువకూడదని అన్నారు. గ్రామాల అభివృద్ధి కావాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి చాడ అనితా రెడ్డి, జిల్లా ఈసి మెంబర్ బూట్ల శ్రీనివాస్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు గడ్డం అరుణ్, బుర్ర శ్రీనివాస్, రామిడి మహేందర్ రెడ్డి, బండి స్వామి, ఉప్పునూటి సాగర్, జంగ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img