epaper
Monday, December 1, 2025
epaper

మేడారం జాతరను విజయవంతం చేద్దాం

మేడారం జాతరను విజయవంతం చేద్దాం
అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్

కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే జనవరి 28న ప్రారంభమై 31 వరకు జరగనున్న మహా మేడారం జాతరను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున మరింత పురోగతిశీల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోటి 50 లక్షల మందికిపైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10 వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. అమ్మవార్ల గద్దల వద్ద మాస్టర్ ప్లాన్ ప్ర‌కారం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.జాతరలో భక్తుల సౌకాల్యం కోసం ఈసారి అదనంగా 5 కొత్త క్యూ లైన్లను ఏర్పాటు చేసి మొత్తం 8 క్యూ లైన్ల ద్వారా దర్శనాన్ని నిర్వహిస్తామని, మూడు గేట్ల ద్వారా బయటికు పంపిణీ చేస్తామని వివరించారు. గత రెండు జాతరాల్లో వచ్చిన అనుభవంతో ఈసారి మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణపై భక్తులకు మైక్ అనౌన్స్‌మెంట్లు, ప్రచార వాహనాలు, నినాదాల ద్వారా అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గంజాయిని అరిక‌ట్టేందుకు నిఘా..!

జిల్లా పరిధిలో గంజాయి విక్రయాలు, చెడు వ్యసనాలు, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. చెడు వ్యసనాలపై కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు. అలాగే అక్రమ ఇసుక, ఎర్ర మట్టి రవాణాపై కఠినంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై పశువులు తిరగకుండా ముందస్తుగా యజమానులకు నోటీసులు జారీ చేసి, వినని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే కార్మికులు, వ్యక్తుల వివరాలను సేకరించడం ద్వారా అనుకోని సంఘటనలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుల కోసం జాతరలో ప్రత్యేక వాహనాలు, గుర్తింపు కార్డులు వంటి సౌకర్యాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. సమస్యలను ప్రజ‌లకు తెలియజేసే క్రమంలో పాత్రికేయులు సూచనలు, సలహాలు ఇవ్వాలని, చిన్న సమస్యలను భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదని చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల...

హెల్ప్ డెస్‌లో అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు అంద‌జేయాలి

హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పరిశీలన కాకతీయ, హనుమకొండ...

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష కాకతీయ ,హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా...

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!! అన్నం పథకంలో అవకతవకలు రూ.5ల భోజనంలో అక్రమాలు పేరుకే తక్కువ...

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి మార్చి నెల నిల్వ‌ల‌తో రేష‌న్ డీల‌ర్ల‌కు...

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌ కాకతీయ, రాయపర్తి : మండలంలోని బురహాన్ పల్లికి...

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు కాకతీయ, నల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి...

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్ కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img