epaper
Sunday, March 1, 2026
epaper

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌
వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు
2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు..
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ల‌క్ష్యం
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరో పార్క్‌లో ఫ్రెంచ్‌ దిగ్గజ సంస్థకు చెందిన సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. భారత ఏవియేషన్‌ రంగంలో ఇదో కీలక మలుపన్న మోదీ, సాఫ్రాన్‌ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఫ్రెంచ్ దిగ్గజ సంస్థ సాఫ్రాన్‌ వాణిజ్య విమానాలకు శక్తినిచ్చే లీప్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏవియేషన్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాల్లో పేరెన్నిక గన్న సఫ్రాన్‌ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన రఫెల్ ఫైటర్ జెట్‌లో వినియోగించే ఇంజిన్ల కోసం మరో ప్రత్యేక మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ ఫెసిలిటీని త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇవాళ్టి నుంచి భారతదేశ విమానయాన రంగం కొత్త ఊపును సంతరించుకుంటుందన్న ప్రధాని సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఎమ్ఆర్‌ఓ కేంద్రం వల్ల భారతదేశాన్ని గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు

సాఫ్రాన్‌ సంస్థ ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్రెంచ్‌ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని, ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందన్నారు. ఏవియేషన్‌కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్నాయని, ఏవియేషన్‌, ఎరోస్పేస్‌కు చెందిన ఉన్నత నిపుణులు కూడా హైదరాబాద్‌ ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్ మధ్య వైమానిక, రక్షణ రంగ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. ఏవియేషన్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాల్లో పేరెన్నిక గన్న సఫ్రాన్‌ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన రఫెల్ ఫైటర్ జెట్‌లో వినియోగించే ఎం 88 ఇంజిన్ల కోసం ప్రత్యేక మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం జీఎంఆర్ ఏరోపార్క్‌లోనే ఏర్పాటు చేసే ప్రత్యేక ఫెసిలిటీ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు భూమిపూజ చేశారు.

2026లో అందుబాటులోకి..

సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీ 2026లో అందుబాటులోకి రానుంది. ఏటా 300 లీప్‌ ఇంజిన్లకు సేవలందించే ఈ ఫెసిలిటీ 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఫెసిలిటీ ద్వారా వెయ్యి మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు ఉపాధి లభించనుంది. ఈ కొత్త ఫెసిలిటీలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వల వినియోగం తగ్గటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా భారతదేశం ప్రపంచ విమానయానానికి హబ్‌గా మారనుంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img