epaper
Thursday, January 15, 2026
epaper

ఆయుధాలు వ‌దిలేస్తాం

ఆయుధాలు వ‌దిలేస్తాం

కూంబింగ్ ఆప‌రేష‌న్స్ ఆపండి
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
సోను దాదా నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం
మావోయిస్టు పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేర లేఖ‌
28న ప్రధాని మోదీ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం
తాజాగా ఆయుధాల విర‌మ‌ణ‌పై మావోల ప్ర‌క‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని.. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే సాయుధ పోరాట విరమణపై తేదీని ప్రకటిస్తాం అని తెలిపింది. ఈమేరకు ఆ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్‌ పేరిట విడుద‌లైన బ‌హిరంగ లేఖ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈనెల 28న ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన మావోయిస్టులపై అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆయుధాల విరమణపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రకటనపై మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందో చూడాల్సి ఉంది.

ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలి

దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కామ్రేడ్‌ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చంద్రన్న, సతీశ్‌ దాదా ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు. ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోందని, అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు.

ఇతర ఉద్దేశాలేమీ లేవు

ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు తమ పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు తమకు కొంత టైం పడుతుందని తెలిపారు. తమ సహచరులను సంప్రదించి, పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు టైం కావాలని కోరారు. ఇంత టైం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవని వెల్లడించారు. త్వరగా కమ్యూనికేట్‌ చేసేందుకు తమకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నామని, భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, తమ అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img