epaper
Tuesday, December 2, 2025
epaper

మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం

మానేరు చెక్‌డ్యామ్ ధ్వంసం

రైతుల్లో ఆందోళన
మూడు కోట్ల నష్టం
పోలీసులు విచారణలోకి
పలు పార్టీ నాయకుల సందర్శనలు.

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీరాంపూర్ మండలం తనుగుల శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ అనుమానాస్పదంగా ధ్వంసమై ప్రాంతంలో కలకలం రేగింది. నవంబర్ 21 రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ ఏఈ పాలకుర్తి రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. దాదాపు 90 మీటర్ల మేర కూలిన ఈ చెక్‌డ్యామ్ వల్ల సుమారు వెయ్యి ఎకరాల సాగుకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం నష్టం మూడు కోట్లకు చేరుకున్నట్లు అంచనా.చెక్‌డ్యామ్ ధ్వంసం విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసులు స్థలాన్ని పరిశీలించి ధ్వంసం విధానంపై క్లారిటీ కోసం విచారణ కొనసాగిస్తున్నారు.

దాసరి మనోహర్ రెడ్డి పరిశీలన
“ ఇది ఇసుక మాఫియా పనే”

ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలో కూలిపోయిన చెక్‌డ్యామ్‌ను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు నదిపై మొత్తం 23 చెక్‌డ్యాంలు నిర్మించిందని, వాటిలో గుంపుల,శంభునిపల్లి చెక్‌డ్యామ్ వేలాది మంది రైతులకు వరమైందని గుర్తుచేశారు. ఈ స్థాయిలో డ్యామ్ కూలిపోవడం యాదృచ్ఛికం కాదని, ఇసుక మాఫియా స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. బాధ్యులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే డ్యామ్ పునర్‌నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. మాజీ సర్పంచ్ సంపత్, ఎల్లస్వామి, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

“ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్ష లేదు” – వొడితల ప్రణవ్

శంభునిపల్లి–గుంపుల చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులకు అత్యంత ఉపయోగకరమైన చెక్‌డ్యామ్ ఇలా ధ్వంసం కావడం తీవ్ర నిర్లక్ష్యమో లేక దురుద్దేశమో అని ప్రశ్నించారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఈ విషయమై ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వెంటనే మరమ్మత్తుల కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కూడా త్వరలో ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని చెప్పారు. రానున్న వేసవిలో రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ప్రణవ్ స్పష్టం చేశారు.మొత్తం మీద…చెక్‌డ్యామ్ ధ్వంసం వ్యవహారం రెండు జిల్లాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రైతులు ఆందోళన చెందుతుండగా, రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. పోలీసులు, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా విచారణను వేగవంతం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య

మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, జగిత్యాల రూరల్: జ‌గిత్యాల‌ మండలంలోని లక్ష్మీపూర్...

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ

కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా...

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు

శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు కాకతీయ,...

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ

136 మొబైల్‌ ఫోన్లు రికవరీ బాధితులకు అంద‌జేసిన జ‌గిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌ కాకతీయ, జగిత్యాల...

తిమ్మాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

తిమ్మాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ :...

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌.. నామినేషన్‌ వేయకుండా కుట్ర న‌ల్ల‌గొండ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి అనుచ‌రుల...

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ...

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌

అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు మంత్రి అడ్లూరి ప‌రామ‌ర్శ‌ బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌న్న ఎమ్మెల్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img