epaper
Tuesday, December 2, 2025
epaper

రూ.12కోట్లు వచ్చాయా?

రూ.12కోట్లు వచ్చాయా?
వరద బాధితులకు ఎప్పుడిస్తారు?
ప్రజలు, అధికారుల్లో సందేహాలు!
అసలు నిధులు వచ్చాయా.. వస్తాయా? ఎప్పుడొచ్చాయంటున్న బల్దియా అధికారులు

కాకతీయ, వరంగల్: ముంథా తుఫానుతో వరంగల్ అతలాకుతలమైంది. ముఖ్యంగా హన్మకొండలోని గోపాల్పూర్ లో గల చెరువు కట్ట తెగి తీవ్ర నష్టం కలిగింది. ముంపుతో ఒక్కో ఇంటికి లక్ష నుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ వరద బాధితులకు ప్రభుత్వం ఇంటికో రూ.15వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అందుకు గాను రూ.12కోట్లు విడుదల చేసినట్లు స్వయంగా మేయర్ గుండు సుధారాణి శుక్రవారం ప్రకటించారు. దీంతో ఆ డబ్బులు ఎప్పుడిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరదలు వచ్చి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్నా బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదు. ఈ విషయమై స్థానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా, ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని మేయర్ పేర్కొనడంపై ముంపు బాధితుల్లో హర్షం వ్యక్తమవుతున్నా.. వాటి పంపిణీ ఎప్పుడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విడుదలైన రూ.12కోట్లు ఏ ప్రాతిపదికన బాధితులకు అందిస్తారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు ఇంటికి రూ.15వేలు ఇస్తారా? నష్టం అంచనాలకు అనుగుణంగా వాటిని పంచుతారా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ.12కోట్లు ఎప్పుడొచ్చాయని బల్దియాకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందా? విడుదల చేస్తామని పేర్కొందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బల్దియా మేయర్ లేదా కమిషనర్ లేదా అధికారులు వాస్తవ వివరాలు వెల్లడించడంతోపాటు నిధుల విడుదలకు సంబంధించిన జీవోను బహిర్గతం చేస్తే బాగుంటుందని ముంపు బాధితులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం బీజేపీ...

మేడారం గ‌ద్దెల ప్రాంగ‌ణ నిర్మాణాల్లో పొర‌పాట్లు జ‌రుగొద్దు

మేడారం గ‌ద్దెల ప్రాంగ‌ణ నిర్మాణాల్లో పొర‌పాట్లు జ‌రుగొద్దు ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు...

రైతులపై తేనెటీగల దాడి

రైతులపై తేనెటీగల దాడి ధాన్యం ఆరబోస్తూ రైతులు కాంటాలు నిర్వహిస్తున్న హమాలీలు తేనెటీగల దాడిలో పలువురు...

లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు

లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కాక‌తీయ‌,...

చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి

చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి ప్రజలకు జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచన తడి...

బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం

బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా బీఆర్ఎస్ గ్రామా పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్ కాకతీయ,ఆత్మకూరు...

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి

టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img