epaper
Monday, December 1, 2025
epaper

ఆజాద్ స‌రెండ‌ర్‌

ఆజాద్ స‌రెండ‌ర్‌

నారాయణ, సోమ్‌దా కూడా..

వీరు ముగ్గురూ రాష్ట్ర క‌మిటీ స‌భ్యులే

డీజీపీ సమక్షంలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఇందులో 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు

ఇంకా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో 59 మంది

కేంద్ర కమిటీలో ఐదుగురు కీల‌క బాధ్య‌త‌లు

సీసీలో మిగిలింది గణపతి, తిరుపతి, రాజిరెడ్డి, హనుమంతు, చొక్కారావు

వివ‌రాలు వెల్ల‌డించిన డీజీపీ శివధర్‌ రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, నారాయణ అలియాస్‌ రమేశ్‌, సోమ్‌దా అలియాస్‌ ఎర్ర ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మిగిలిన 34 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని తెలిపారు. డీజీపీ వివరాల ప్రకారం … లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్‌ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులుగా ఉన్నారు. వీరంతా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

పునరావాస ప్యాకేజీ ఇస్తాం..

డీజీపీ మాట్లాడుతూ …. అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపున‌కు స్పందించి మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో కలవడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఆజాద్‌పై రూ.20 లక్షలు, నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉండగా, మొత్తం లొంగిపోయిన మావోయిస్టులందరిపై కలిపి రూ.1.41 కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ఆ మొత్తాన్ని వారికే అందజేయనున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందినవారికి పునరావాస ప్యాకేజీ కూడా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

త్వ‌ర‌గా లొంగిపోవాలి

అలాగే తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్‌ గణేశ్‌, బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఉన్నారని చెప్పారు. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు కూడా త్వరితంగా లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌.. నామినేషన్‌ వేయకుండా కుట్ర న‌ల్ల‌గొండ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి అనుచ‌రుల...

కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు...

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు లక్కీ డ్రా లో మద్యం దుకాణాలు...

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే రాష్ట్ర అభివృద్ధి ఆలోచ‌న చేయ‌డం లేదు మూసీ ప్రాజెక్టు...

బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా..

బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా.. ఆరు గ్యారంటీల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం కేంద్రం నిధుల...

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ విమానయాన రంగానికి సంబంధించి...

ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌

ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఐబొమ్మ ప్రధాన...

మోగిన పంచాయతీ నగారా

మోగిన పంచాయతీ నగారా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నిక‌లు డిసెంబర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img