epaper
Thursday, January 15, 2026
epaper

తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం

తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత కలకలం

ఇసుక మాఫియా పనేనా..? రైతుల్లో ఆగ్రహావేశం

కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వాగుపై నిర్మించిన మానేరు చెక్‌డ్యామ్‌ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామాలన్నీ ఒక్కసారిగా కలవరపడ్డాయి. చెక్‌డ్యామ్‌ను నిశితంగా కూల్చివేయడం వెనుక అక్రమ ఇసుక మాఫియా కుట్రే ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తనుగుల వాగులో కొంతకాలంగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకే ఈ చెక్‌డ్యామ్ అడ్డుకట్ట వేస్తోందని, ఈ అడ్డంకిని తొలగించుకునేందుకు రాత్రి వేళల్లో పథకం ప్రకారం దాడి జరిగిందని గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక వ్యాపారానికి డ్యామ్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్న ముఠాలు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో విలాసాగర్ చెక్‌డ్యామ్‌ను కూడా ఇలాంటివారే ధ్వంసం చేశారని గుర్తుచేసుకుంటూ, చెక్‌డ్యామ్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వెనుక ఒకే మాఫియాకు చెందిన వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇలా ఒకొకటిగా చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తుంటే వాగుల్లో నీటి నిల్వలు పూర్తిగా నశించిపోతాయి. పంటల భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ఈ దాడుల వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెలికితీసి చర్యలు తీసుకోవాలి అని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.చెక్‌డ్యామ్ ధ్వంసంతో వావిలాల, మీర్జంపేట,గుంపుల,తనుగుల, శంబునిపల్లి,పాపక్కపల్లె,పోచంపల్లి,నాగారం, పలు గ్రామాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. వేల ఎకరాల్లో సాగు నీటి సరఫరా నిలిచిపోయింది.ప్రజా డబ్బుతో ప్రభుత్వం నిర్మించిన ఈ ఆస్తిని ఇలా ధ్వంసం చేయడానికి మాఫియాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.? రాజకీయ అండ, అధికారుల మౌనమే వీరికి బలం ఇస్తోంది కాదా.? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు పోలీసులు కూడా వెంటనే విచారణలోకి దిగాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెక్‌డ్యామ్‌ను కూల్చివేసిన దుండగులను, వారిని ఆశ్రయిస్తున్న ఇసుక మాఫియా ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు పట్టుతున్నారు. చెక్‌డ్యామ్‌ను అత్యవసర ప్రాతిపదికన పునర్నిర్మించాలని కూడా వారు డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img