epaper
Thursday, January 15, 2026
epaper

విజయవాడలో పట్టుకొని అడ‌విలో కాల్చి చంపిండ్రు

  • హిడ్మా ఎన్‌కౌంట‌ర్ బూట‌కం
  • 15న తేదీన ఏపీలో అదుపులోకి..
  • ద్రోహి స‌మాచారంతో క్రూరంగా హత్య‌
  • హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు
  • అమ‌రుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం
  • మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
  • 23న దేశవ్యాప్తంగా నిరసన దినం
  • అభయ్ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, నిరాయుధులైన తమ నేతలను పోలీసులు పట్టుకొని హత్య చేశారని ఆరోపించింది. అభయ్ పేరుతో శుక్ర‌వారం ప్రెస్ నోట్ విడుద‌లైంది. కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే మరికొందరితో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడ వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో, కొందరి ద్రోహంవల్ల సమాచారం పోలీసులకు చేరింది. నవంబర్ 15న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లొంగిపోవాలని ఒత్తిడి చేసి, వారు నిరాకరించడంతో క్రూరంగా హత్య చేసి, మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని లేఖలో ఆరోపించారు. రంపచోడవరంలో ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌ను కూడా ఇలాగే హత్య చేశారని పేర్కొన్నారు.

23న దేశవ్యాప్తంగా నిరసన

ఈ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రాణాలు అర్పించిన హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని శపథం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద, మారేడుమిల్లి ఘటనపై పోలీసుల కథనానికి పూర్తి భిన్నమైన వాదనను మావోయిస్టు పార్టీ తమ లేఖ ద్వారా ముందుంచ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయ‌మైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img