epaper
Thursday, January 15, 2026
epaper

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌
వ్య‌క్తి గ‌త క‌క్ష‌, భూ వివాద‌మే కారణం
పోలీసుల అదుపులో 6 గురు నిందితులు
వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ

కాకతీయ,కరీంనగర్ : కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు.
భూమి అమ్మకం కమీషన్ గొడవలు, వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణమయ్యాయని శుక్రవారం సిపి గౌష్ ఆలం మీడియా కు వివరాలు వెల్లడించారు.పథకం ప్రకారం దినేష్‌ను మద్యం పేరుతో బయటకు తీసుకువెళ్లి, దారుణంగా మట్టుబెట్టిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.దేవునూరి సతీష్, దినేష్ మధ్య భూవివాదాలు నెలకొని ఉండగా, మరో నిందితుడు దేవునూరి సంతోష్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో దినేష్ పలుమార్లు బెదిరించడంతో కక్షలు పెరిగాయి. ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్‌కు చెప్పగా, ఇద్దరికీ దినేష్‌ వల్ల ముప్పు ఉందన్న భావనతో హత్యకు ప్రణాళిక పన్నాడు.ఫిబ్రవరి 25, 2024న శ్రావణ్ కుటుంబంలో జరిగిన మరణం కారణంగా అక్కడికి వచ్చిన దినేష్‌ను మద్యం పేరుతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఎర్టిగా కారును కిరాయికి తెచ్చి, మద్యం తాగించిన అనంతరం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్‌ను తీసుకొచ్చి నిందితులంతా కలిసి దారుణంగా దాడి చేశారు. తరువాత అతన్ని కారులో ఎక్కించుకొని నూకపల్లి శివారులో ఆపి తాడుతో మెడను బిగించి హత్య చేశారు. తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు.ప్రధాన నిందితులైన దేవునూరి సతీష్, శ్రావణ్ గతంలో గంగాధరలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు చొప్పదండి సిబ్బంది మల్కాపూర్‌లో దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా, హత్యకు ఉపయోగించిన ఎర్టిగా కారు, యమహా బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.ఈ కేసును ఛేదించడంలో చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్‌కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు నరేష్‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తి సిబ్బంది ఓర్పుతో పని తీరును,సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img