కాకతీయ, పరకాల: సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పరకాల మండలం, నడికూడా మండలం వైద్యాధికారిణి డాక్టర్ దివ్య ఆధ్వర్యం,లో పరకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో విద్యార్థులకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమానికి పరకాల యంపీడీఓ పెద్ది ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా వారు హాజరై మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆగస్ట్11 వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం ప్రభుత్వం జరుపుతుందని, 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగి వున్న పిల్లలు తప్పనిసరిగా ఒక ఆల్బండాజోలు మాత్ర వేసుకోవాలని కోరారు.
ఈ రోజు ఎవరైనా హాజరు కాకుంటే మాప్ అప్ డే రోజు 18.08.25 తప్పని సరిగా వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.హెచ్ పి డాక్టర్ మాధవి, వైద్యసిబ్బంది రాజకుమార్ ఆరోగ్య విస్తరణ అధికారి,హెల్త్ సూపర్ వైజర్ , హెల్త్ అసిస్టెంట్ లు, ఏ.యన్.యం.లు, ఆశా వర్కర్లు,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


