epaper
Thursday, November 20, 2025
epaper

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి
ఈటల డిమాండ్

హుజూరాబాద్ ప్రజలే నా బలం ఎలా మర్చిపోతా ఈటల

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో రోజులు లాగుతున్నారు. క్వింటాల్‌కు ఎనిమిది కిలోలా తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్ ఇప్పటికీ అందరికీ చేరలేదని, ఈసారి అయినా ప్రతి రైతుకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.రైతు రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదని, వరదలతో మునిగిన వరి రైతులు, తుఫానుతో నష్టపోయిన రైతులు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. పత్తి కొనుగోళ్లలో కూడా జాప్యం ఉండకూడదని, కఠినమైన ‘7 క్వింటాళ్ల’ నిబంధనను ఎత్తివేయాలని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీసీఐ కూడా నిబంధనలు సడలించాలని కోరారు. ఫసల్ భీమా చెల్లింపులు ప్రభుత్వం సమయానికి చేస్తే రైతులు ఇబ్బందులు పడేవారేమన్నారు.

హుజూరాబాద్‌లో మాకు మెజారిటీ సీట్లు ఈటల ధీమా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండేందుకే వారి పాత్ర కీలకమని చెప్పారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున బూతు స్థాయిలో పటిష్ట బలం ఏర్పరుస్తామని ప్రకటించారు. జిల్లాలోని 107 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ భాగం తమ పార్టీ గెలుచుకునే సత్తా ఉందన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటేసిన ప్రజలు ఎదురుచూసిన పనులు రెండు సంవత్సరాలుగా జరగకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.నన్ను 25 సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్ గడ్డ ఆ ప్రజలను ఎలా మర్చిపోతా అని భావోద్వేగంతో చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, చీకట్లోనే రోజులు గడుస్తున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.

ఉన్నదాన్ని చెప్పుకోలేని వారు అబద్ధాలతో బ్రతుకుతున్నారు

తాము చేసిన అభివృద్ధి పనులను ఎప్పుడూ ప్రచారం చేయలేదని, ధర్మాన్ని, ప్రజలను, పనిని నమ్ముకున్న వాడినేనని ఈటల అన్నారు.తట్టెడు మట్టి తీయలేదంటారా హుజూరాబాద్‌లో వేగవంతమైన నాలుగు లైన్లు ఎవరు వేశారు? కరెంట్ కోసం కంటిరెప్పపాటు ఎదురు చూడని విధంగా సబ్‌స్టేషన్లు ఎవరు నిర్మించారు? జలకళ కోసం చెక్‌డ్యామ్‌లు ఎవరు కట్టించారు? కమలాపూర్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.ఇవన్నీ ప్రజలకు తెలుసు దొంగముఖాలకు అర్థం కాదు. అబద్ధాలే ఆధారంగా బ్రతికే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా, బీజేపీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మహిళా మోర్చా జిల్లా ప్రతినిధి రమరెడ్డి, పార్టీ నాయకులు సమ్మయ్య, దేవిక, చొప్పరి వేణు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌ నిర్దోషి గా తేల్చిన...

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ...

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ పార్వతి...

బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి

బోధ‌న‌ల్లో సృజ‌నాత్మ‌క‌త ఉండాలి అల్ఫోర్స్ విద్యా సంస్థ‌ల అధినేత వి. నరేందర్ రెడ్డి అల్ఫోర్స్...

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం

ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు...

కరీంనగర్ ట్రాఫిక్‌కి కొత్త ‘కానిస్టేబుల్’లు!

కరీంనగర్ ట్రాఫిక్‌కి కొత్త ‘కానిస్టేబుల్’లు! నగర ట్రాఫిక్‌పై నజార్ కానిస్టేబుల్ బొమ్మల ‘పహారా’ ఎల్ఎండీ...

పిల్లల హక్కులను కాపాడాలి

పిల్లల హక్కులను కాపాడాలి వలస సుభాష్ చంద్రబోస్ బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ...

బాలల హక్కుల రక్షణ సమాజం మొత్తం బాధ్యత

బాలల హక్కుల రక్షణ సమాజం మొత్తం బాధ్యత కలెక్టర్ పమేలా సత్పతి సందేశం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img