epaper
Thursday, November 20, 2025
epaper

భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌?

భార‌త్ షూట‌ర్‌కు మోదీ మంత్రి ప‌ద‌వి.. అస‌లెవ‌రీ శ్రేయసి సింగ్‌?
బీహార్‌లో ఏర్ప‌డ్డ‌ కొత్త ప్రభుత్వం
పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
కేబినెట్‌లో ముగ్గురు మహిళలకి స్థానం
క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం వరకు శ్రేయసి సింగ్ ప్రయాణం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించగా, మొత్తం 26 మంది మంత్రులు కేబినెట్‌లో చేరారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

ఈ సారి బీహార్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళలకు స్థానం లభించింది. లేషి సింగ్, రమా నిషాద్‌తో పాటు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయసి సింగ్ తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆమె రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయడంతో ఇప్పుడు ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది.

1991 ఆగస్టు 29న బీహార్‌లోని గిఢౌర్ గ్రామంలో జన్మించిన శ్రేయసి, ఎదిగింది షూటింగ్ ప్రపంచంలో. ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు అందించి దేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన షూటర్‌గా ఆమె సుపరిచితమే. 2014 లో కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ఫైనల్‌లో 92 పాయింట్లు సాధించి ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది. 2017లో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషికి గాను ఆమెకు అర్జున అవార్డు లభించింది.

29 ఏళ్లకే బీజేపీలో అడుగు… తొలి ఎన్నికే సంచలన విజయం

2020లో కేవలం 29 ఏళ్ల వయసులో ఆమె బీజేపీలో చేరి రాజకీయాల పట్ల తన ఆసక్తిని ప్రదర్శించారు. అదే సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జముయ్ నుంచి పోటీ చేసి RJD అభ్యర్థి విజయ్ ప్రకాష్‌ను 41,000కుపైగా మెజారిటీతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2025లో జరిగిన ఎన్నికల్లో కూడా శ్రేయసి జముయ్ నియోజకవర్గం నుంచి 54,498 ఓట్ల భారీ తేడాతో గెలుపొంది మరొకసారి తన రాజకీయ బలాన్ని చాటారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆమె బీహార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.

అయితే శ్రేయసి రాజకీయాలకు కొత్తేమి కాదు. ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి ఎంపీగా ఉన్నారు. తండ్రి, తాత ఇద్దరూ నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI)లో కీలక పదవుల్లో పనిచేశారు. కాగా, కామన్వెల్త్‌ గేమ్స్‌ పతకాల ప్రకాశం నుంచి బీహార్ రాజకీయ జగత్తులో మంత్రిపదవి వరకు శ్రేయసి సింగ్‌ ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. క్రీడలో సంపాదించిన క్రమశిక్షణ, ధైర్యం, ఫోకస్ ఇప్పుడు రాజకీయాల్లో ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి. భారత్‌కు పతకాలు తెచ్చిన ఈ షూటర్‌.. ఇప్పుడు బీహార్ అభివృద్ధి లక్ష్యానికి టార్గెట్‌ సెట్ చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు

ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు! ఎర్రకోట బ్లాస్ట్...

అమెరికాతో హై-ఎండ్ డీల్.. భారత్‌కు జావెలిన్ మిస్సైల్ సపోర్ట్!

అమెరికాతో హై-ఎండ్ డీల్.. భారత్‌కు జావెలిన్ మిస్సైల్ సపోర్ట్! భారత్–అమెరికా స్ట్రాటజిక్ బంధానికి...

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్! ఢిల్లీ...

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా? ఎంఎస్‌బీఎస్ అమెరికా పర్యటన...

పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష..

పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత! నవంబర్ 17 హసీనా జీవితాన్ని...

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్.. హీటెక్కిన బీహార్ పాలిటిక్స్! బీహార్ ఎన్డీయేలో...

బిహార్​లో ఎన్డీఏదే అధికారం

బిహార్​లో ఎన్డీఏదే అధికారం మళ్లీ నితీశ్​ సర్కార్ వైపే ఓటర్లు మహాకూటమికి 100లోపే సీట్లు.. జన్​...

సౌదీలో బ‌స్సు ప్ర‌మాదం.. 42 మంది మృతి

సౌదీలో బ‌స్సు ప్ర‌మాదం.. 42 మంది మృతి మృతుల్లో 20 మంది మ‌హిళ‌లు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img